ప్లాస్టిక్ బాటిళ్లలో 2 లక్షల పైన నానోప్లాస్టిక్ కణాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. ఇవి హృద్రోగాలు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్ బాటిళ్లు ఓ సాధారణ దృశ్యంగా మారిపోయాయి. వంటగది సామగ్రి నుండి పానీయాల వరకు ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నా, ప్రజల ఉపయోగంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక పరిశోధన షాకింగ్ నిజాలను బయటపెట్టింది.
ఒక లీటర్ ప్లాస్టిక్ బాటిల్లో సగటున 2 లక్షల నానోప్లాస్టిక్ కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి మనం తాగే నీటితో కలిసి శరీరంలోకి ప్రవేశించి, హృద్రోగాలకు కారణమవుతాయని అధ్యయనాల్లో తేలింది. అమెరికాలోని ఒక పరిశోధనా సంస్థ చేసిన అధ్యయన ప్రకారం, నానోప్లాస్టిక్స్ గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని, ఇవి కొన్నిసార్లు గుండె అడ్డంకులను కూడా కలిగించగలవని తెలిపింది.
ఈ నేపథ్యంలో నిపుణులు ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. హానికర ప్రభావాల గురించి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ను తగ్గించటమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇతర ప్రత్యామ్నాయాలను అనుసరించాలి.

ఇంతే కాదు.. ప్లాస్టిక్ బాటిళ్ల ద్వారా ఫ్లోరైడ్, ఆర్సెనిక్ వంటి హానికర రసాయనాలు కూడా శరీరంలోకి చేరుతాయి. ఇవి కేవలం గుండెపోటుకే కాదు, రొమ్ము క్యాన్సర్, కాలేయ సంబంధిత వ్యాధులకు కూడా దారితీయగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం ఎక్కువగా రోజూ ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి నీటిని తాగేవారిపై పడే అవకాశం ఉందని మహారాష్ట్రకు చెందిన కార్డియాలజీ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిపుణులు ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. హానికర ప్రభావాల గురించి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ను తగ్గించటమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇతర ప్రత్యామ్నాయాలను అనుసరించాలి.