రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. పిల్లలకు పాలివ్వని తల్లులకు

తల్లిపాలు తల్లీ, శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు ఇవ్వడం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తల్లిపాలు శిశువు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ప్రకృతి తల్లి తన శరీరాన్ని అమృతంగా మార్చింది. ఈ అమృతమే తల్లి పాలు. శిశువుకు జీవాధారంగా నిలిచే తల్లిపాలు, తల్లి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే నేటి జీవనశైలి, ఫిజికల్ ఫిట్‌నెస్ (figure anxiety), బ్యూటీ ఆందోళనలు వంటి కారణాలతో మహిళలు తల్లిపాలిచ్చే ప్రక్రియకు దూరమవుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పిల్లల ఆరోగ్యానికే కాకుండా తల్లుల ఆరోగ్యంపైనా తీవ్రమైన ప్రభావం చూపుతోందని హెచ్చరిస్తున్నారు.

తల్లిపాలలో ఉండే యాంటీబాడీలు, పోషకాలు శిశువు రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా, వారి ఎదుగుదలకూ తోడ్పడతాయని అయితే తల్లిపాలు ఇవ్వడం వల్ల శరీర ఆకృతి చెడిపోతుందన్న అపోహలతో చాలామంది మహిళలు తల్లిపాలను నివారిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి తల్లిపాలు ఇవ్వడం శరీరంలోని కొవ్వును కరిగించి బరువును అదుపులో ఉంచుతుందన్నారు.

తల్లిపాలు ఇచ్చే సమయంలో శరీరంలో ఉత్తేజితమయ్యే ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ హార్మోన్లు రొమ్ము కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా క్యాన్సర్ పుట్టే అవకాశాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు, తల్లిపాలివ్వడం వలన రుతు చక్రంలో మార్పులు రావడం వల్ల ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గుతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ అధికంగా ఉండటం రొమ్ము క్యాన్సర్ పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక తల్లిపాలు ఇవ్వని మహిళల్లో రొమ్ము గ్రంథుల్లో వాపులు వచ్చి, అది క్రమంగా కణితులుగా మారి, ఆపై క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని డా. పూజా ద్వివేది హెచ్చరిస్తున్నారు. తల్లి పాలివ్వడం శిశువు ఆరోగ్యానికే కాకుండా తల్లికీ జీవనదానంగా మారుతుందనే అంశాన్ని ప్రతి మహిళ గుర్తించి, తనను తాను కాపాడుకోవాలన్నది నిపుణుల చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *